Posted on 2026-01-23 20:18:01
బారాస లీగల్ సెల్ కన్వీనర్ మధుసుదన్ రావు విమర్శ
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో శాపంగా మారనుందని బారసా లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచిత్రవిన్యాసాలు చేస్తున్నదని ఆయన అన్నారు. కేటీఆర్, హరీష్ రావు లకు ఫోన్ ట్యాపింగ్ నోటీసులు అనే ఒక కల్పిత కథలో కథనాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అధినాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డెనని పేర్కొన్నారు. నోటీసులను చూసిన తెలంగాణ ప్రజలు నొసలు వెక్కిరిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం నుండి ఉద్భవించిన కేటీఆర్, హరీష్ రావు లనే ఉద్యమ శక్తులను ట్యాపింగ్ అనే తప్పుడు కేసులో ఇరికించి ఎదో సాధిస్తామనే పగటి కలలను కాంగ్రెస్ నాయకులు కంటున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కలలన్ని కల్లలు కాకతప్పదని అన్నారు. అభూత కల్పిత కథలతో అల్లిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాంగ్రెస్ పార్టీకి శాపంగా కాబోతున్నాయని మధుసుధన్ రావు పేర్కొన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయం భారాస నాయకుల వైపే ఉన్నదని ఆయన తెలిపారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >