Posted on 2026-01-24 11:02:59
సస్పెన్షన్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్పై డీఏ కేసు!
రూ.7.83 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
డైలీ భారత్, రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్ రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఓ–1)గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా/ఏసీబీ) అధికారులు అక్రమాస్తుల (డీఏ) కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఈరోజు అనిశా అధికారులు మధుసూదన్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, అనుచరులకు సంబంధించిన మొత్తం ఏడు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున స్థిర, చర ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.
సోదాల్లో ఈసీఐఎల్ ప్రాంతంలో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించిన మూడు అంతస్తుల భవనం, ఇబ్రహీంపట్నం మండలంలో ఒక బహిరంగ ప్లాటు మరియు ఒక ఎకరం వాణిజ్య భూమి, పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఈత కొలను కలిగిన ఫామ్హౌస్ను అధికారులు గుర్తించారు.
అలాగే 1.2 కిలోల బంగారు ఆభరణాలు, మూడు నాలుగు చక్రాల వాహనాలు (ఫార్చ్యూనర్, వోల్వో, వోక్స్వ్యాగన్) మరియు రూ.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ (దస్తావేజు ప్రకారం) సుమారు రూ.7,83,35,302గా అధికారులు అంచనా వేశారు.
ఇదే సమయంలో ‘ఏఆర్కే స్పిరిట్స్’ పేరిట మద్యం వ్యాపారంలో సుమారు రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు, అలాగే తన భార్య, పిల్లల పేర్లపై రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు కూడా అనిశా అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అదనపు అక్రమాస్తులపై విచారణ ఇంకా కొనసాగుతోందని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >