| Daily భారత్
Logo




కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా

News

Posted on 2026-01-24 11:07:34

Share: Share


కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా

డైలీ భారత్ నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులో రూట్ వాచ్ ఆపరేషన్ సమయంలో గంజాయిస్ ముఠా ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యకు అతి దారుణంగా కారుతో ఢీ కొట్టిన సంఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం సుమారు 6:45 గంటల సమయంలో, నిజామాబాద్ పట్టణానికి ఎండుగంజాయి (డ్రై గంజా) తరలింపు జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంపై ఆధారపడి, నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీఐ ) ఆమె సిబ్బందితో కలిసి పట్టణ పరిధిలోని మాధవనగర్ ప్రాంతంలో రూట్ వాచ్ నిర్వహించారు.

ఆపరేషన్ సమయంలో ఒక కారును తనిఖీ కోసం ఆ వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేయగ ఆ వాహనం ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యను ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్  హాస్పిటల్ కు తరలించారు.

సంఘటన సమాచారం అందిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్య పరీక్షల అనంతరం, కానిస్టేబుల్ జి. సౌమ్యకు అంతర్గత పొట్ట గాయాలు అయినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటనను నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించబడింది. సంఘటనకు సంబంధించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అదనంగా, వాహనం నుంచి సుమారు 2 కిలోగ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.

Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >