Posted on 2026-01-24 12:38:00
ఎక్సైజ్ కానిస్టేబుల్ కు న్యాయం జరగాలంటూ ఎక్సైజ్ జిల్లా కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన ఎక్సైజ్ ఉద్యోగులు
పరిస్థితి ఉద్రిక్తం..
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పై గంజాయి ముఠా దాడి కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ కు న్యాయం జరగాలంటూ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఎక్సైజ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎక్సైజ్ ఘటనపై, ఎక్సైజ్ సీఐ ల వ్యవహారం ఉండడంతో ఎక్సైజ్ ఉద్యోగులుఎక్సైజ్ సూపరిండెంట్ ను మల్లారెడ్డి ని నిలదీశారు.
గంజాయి కేసుల విషయంలో కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల పదోన్నతిలకోసం కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి రవాణా లేకున్నా పక్క జిల్లా కేసుల చేదనలో ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న ఎక్సైజ్ ఉద్యోగుల ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు సోమిరెడ్డి, డి సీ మల్ల రెడ్డి ఆందోళన కారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >