Posted on 2026-01-24 13:13:26
డైలీ భారత్, హుజూర్ నగర్: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల గంధం ఊరేగింపు కార్యక్రమంలో పిల్లుట్ల రఘు పాల్గొన్నారు. ముందుగా దర్గాకు వెళ్ళి దర్శనం చేసుకున్న రఘు భక్తులతో మమేకమై ప్రతి ఒక్కరికీ వందనం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్బంగా రఘు మాట్లాడుతూ నాకు ఏ అధికారం లేకుండానే ఎన్నో సేవ కార్యక్రమాలు చేశానని ఎంతో మంది పేదలకు అండగా ఉన్నానని తెలియజేశారు. నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో నేను ఏదో ఒక రూపంలో సహాయం అందించానని గత నాలుగు సంవత్సరాలుగా ఏ పదవి లేకుండానే అనేక గ్రామాలకు తండాలకు అండగా నిలిచానని ఈ సారి ఒక బలమైన పార్టీ నుండి రాబోతున్ననని ఒక్క అవకాశమిస్తే నియోజకవర్గం రూపు రేఖలు మారుస్తానని అన్నారు.ఉర్సు ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >