Posted on 2026-01-24 16:06:34
14,50,000/- జరిమానాలు విధించిన సంబంధిత కోర్టులు
పోలీస్ కమిషనర్ వెల్లడి.
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగముగా జనవరి 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 158 కేసుల నమోదు చేశామని సిపి సాయి చైతన్య వెల్లడించారు. వీరందరినీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా ఈ 158 మందికి కోర్టు లో హాజరు పరచగా వీరికి రూ: 14,50,000/- జరిమానా విధించడం జరిగిందన్నారు. ఇందులో 13 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. వాహనాదారులు వాహనానికిసంబంధించినటువంటి పత్రములు జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >