Posted on 2026-01-24 21:03:49
దరఖాస్తు చేసుకునేందుకు చివరి 25.01.2026
డైలీ భారత్, వరంగల్ : తెలంగాణ ఉమ్మడి జిల్లాలోని 2025-26విద్యాసంవత్స రంలో సాంఘిక సంక్షేమ గురుకులాలతో పాటు బిసి, ట్రైబల్ వెల్ఫేర్ మరియు జనరల్ గురుకులాల్లో ప్రవేశ పరీక్ష అవగాహన కార్యక్రమంలో భాగంగా హన్మకొండ హాంటర్ రోడ్డులో ఉన్న ధర్మసాగర్ సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు మాడిశెట్టి సుధ, ప్రిన్సిపాల్ సల్ల శైలజ ఆధ్వర్యంలో వరంగల్ కాశిబుగ్గ లో ఉన్న వివిధ ప్రాంతాల్లో మరియు ఎల్ బి నగర్ లో ఉన్న చార్బౌలి ప్రాథమిక పాఠశాలను సందర్శించి. గురుకులాల్లో ప్రవేశం కోసం నాల్గవ తరగతి మరియు 6 నుంచి 8వతరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరిని జనవరి25వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 22న జిల్లాకేంద్రాలలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా గురుకుల పాఠశాలలో కల్పించే వసతులు, విద్యా ప్రమాణాలు, క్రీడలు తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >