Posted on 2026-01-25 23:22:13
డైలీ భారత్, కామారెడ్డి: తపస్ కామారెడ్డి జిల్లా కార్యనిర్వాహక సమావేశం జిల్లా అధ్యక్షులు భూనేకర్ సంతోష్ గారి అధ్యక్షతన స్థానిక శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యదర్శి రాఘవ రెడ్డి గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు, పి.ఆర్.సి, పాత పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటే ఉపాధ్యాయ సమాజానికి మేలు జరుగుతుందని తెలిపారు.
అలాగే 317 జీవో వల్ల భాధితులైన ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చడం అత్యవసరమని, దీనిపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి పరిష్కారం చూపాలని కోరారు. నూతన విద్యావిధానం అమలులో ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, విద్యా వ్యవస్థ బలోపేతానికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
2010 కన్నా ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వడం సముచితమైన డిమాండ్ అని పేర్కొంటూ, దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడినాయి:
తపస్ జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించడం జరిగినది
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి పి.ఆర్.సి అమలు చేయుట
నూతన విద్యావిధానం సవ్యంగా అమలు చేయుట
317 జీవో భాధితులకు న్యాయం చేకూర్చుట
సి.పి.యస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయుట
2010 కన్నా ముందు నియమితులైన వారికి టెట్ నుండి మినహాయింపు ఇవ్వుట
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, తపస్ రాష్ట్ర బాధ్యులు భాస్కరాచారి గారు పాల్గొన్నారు. జిల్లా బాధ్యులు రాజశేఖర్, ఆంజనేయులు, లక్ష్మీపతి, రాజకుమార్, మధు, వేదప్రకాష్, కృష్ణ తదితరులు, అలాగే వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పవన్, మల్లేష్, స్వామి, శశిధర్, ఆంజనేయులు, సంతోష్ తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >