| Daily భారత్
Logo




తపస్ కామారెడ్డి జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహణ

News

Posted on 2026-01-25 23:22:13

Share: Share


తపస్ కామారెడ్డి జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహణ

డైలీ భారత్, కామారెడ్డి: తపస్ కామారెడ్డి జిల్లా కార్యనిర్వాహక సమావేశం జిల్లా అధ్యక్షులు భూనేకర్ సంతోష్ గారి అధ్యక్షతన స్థానిక శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో  నిర్వహించబడింది.

ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యదర్శి రాఘవ రెడ్డి గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు, పి.ఆర్.సి, పాత పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటే ఉపాధ్యాయ సమాజానికి మేలు జరుగుతుందని తెలిపారు.

అలాగే 317 జీవో వల్ల భాధితులైన ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చడం అత్యవసరమని, దీనిపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి పరిష్కారం చూపాలని కోరారు. నూతన విద్యావిధానం అమలులో ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, విద్యా వ్యవస్థ బలోపేతానికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

2010 కన్నా ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వడం సముచితమైన డిమాండ్ అని పేర్కొంటూ, దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడినాయి:

తపస్ జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించడం జరిగినది

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి పి.ఆర్.సి అమలు చేయుట 

నూతన విద్యావిధానం సవ్యంగా అమలు చేయుట

317 జీవో భాధితులకు న్యాయం చేకూర్చుట

సి.పి.యస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయుట

2010 కన్నా ముందు నియమితులైన వారికి టెట్ నుండి మినహాయింపు ఇవ్వుట

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, తపస్ రాష్ట్ర బాధ్యులు భాస్కరాచారి గారు పాల్గొన్నారు. జిల్లా బాధ్యులు రాజశేఖర్, ఆంజనేయులు, లక్ష్మీపతి, రాజకుమార్, మధు, వేదప్రకాష్, కృష్ణ తదితరులు, అలాగే వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పవన్, మల్లేష్, స్వామి, శశిధర్, ఆంజనేయులు, సంతోష్ తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >