| Daily భారత్
Logo




గణతంత్ర దినోత్సవం రోజున ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం

News

Posted on 2026-01-26 17:16:35

Share: Share


గణతంత్ర దినోత్సవం రోజున ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి హెల్త్ క్యాంప్  నిర్వహించడం అభినందనీయం

మిర్చి కాంపౌండ్ లో బిజెపి యువ నాయకుడు  ఏర్పాటుచేసిన ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నగరంలోని 34 వ డివిజన్ పరిధిలోని మిర్చి కంపౌండ్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిజెపి యువ నాయకుడు బంటు ప్రవీణ్ కుమార్( పండు) ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ  గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున తమ బిజెపి నాయకుడు పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇలాంటి యువకులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. పేద, మధ్య తరగతి వారికి ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యమేనని తర్వాత (ఆవాస్) ఒక గృహాన్ని నిర్మించుకోవడం చిరకాల స్వప్నమని, వీటిని నిర్వర్తించి పేదలకు సమకూర్చాల్సిన కనీస  బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించాక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు చూశానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో గాంధీ, ఉస్మానియా, ఆస్పత్రుల తర్వాత అత్యధిక ఓపి పేషెంట్లు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని, కేవలం జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా వైద్యం కోసం పెద్ద ఎత్తున పేషెంట్లు వస్తారని ఎమ్మెల్యే అన్నారు. కానీ ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా ఆరోగ్యపరమైన మిషిన్లు లేకపోవడం, అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండకపోవడం పేదవారు చేసుకున్న దౌర్భాగ్యమని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన మిషన్ జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నప్పటికీ అది ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం దురదృష్టకరమైన విషయం అన్నారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేక శ్రద్ధ వహించి పేద ప్రజలకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ హెల్త్ క్యాంప్ లో ఎంఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు జనరల్ మెడిసిన్ డాక్టర్ దొరబాబు, జనరల్ సర్జన్ డాక్టర్ వెంకటరమణ, న్యూరో సర్జన్ డాక్టర్ సర్పరాజ్ పాల్గొన్నట్లు బిజెపి యువ నాయకుడు బంటు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఆరోగ్య శిబిరంలో షుగర్ టెస్ట్ లు, బిపి టెస్టులతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >