Posted on 2026-01-27 02:18:53
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార పార్టీ నేతలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్రంలో బల్దియా ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రానున్నారని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిలు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభనిర్వహించేందుకు నిజామాబాద్ రూరల్ మండలం కేశపూర్ గ్రామ శివారులోని ప్రైవేట్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ నెల 27,28న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో రానుండటంతో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన దాదాపు ఖాయమైనట్లు అధికార పార్టీ నాయకులు ఆ పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇది వరకు జిల్లాల పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రాకపోవడంతో బల్దియా ఎన్నికల ప్రచారం కోసం రప్పిస్తున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >