Posted on 2026-01-26 22:14:50
డైలీ భారత్, హుజూర్ నగర్: ఎముకలు, కీళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్య పరీక్షలు చేయించు కోవడం ద్వారా దీర్ఘకాలిక నొప్పులు శస్త్రచికిత్స అవసరాన్ని తగ్గించవచ్చని సీఐ చరమందరాజు తెలిపారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని గాంధీ హాస్పిటల్ నందు ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా గాంధీ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ సంయుక్తంగా ఉచిత ఆర్థోపెడిక్ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పలువురు పట్టణ ప్రజలకు మెడికవర్ హాస్పిటల్ వారి ఫ్యామిలీ కార్డులను ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ చరమందరాజు చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు.కార్డు ద్వారా భవిష్యత్తులో వారికి మెడికవర్ హాస్పిటల్లో వివిధ వైద్య సేవలను సులభంగా పొందే అవకాశం కల్పించబడిందని హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఇలాంటి ఆర్థోపెడిక్ అవుట్రీచ్ కార్యక్రమాలను సంయుక్తంగా కొనసాగిస్తామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >