Posted on 2026-01-28 10:29:24
నామినేషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందొబస్త్ ఏర్పాట్లు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాదు జిల్లా లోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు 2026 లో భాగంగా నిజామాబాద్ డివిజన్ లోని 4 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీటీడీ కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి నామినేషన్ల స్వీకరణ కేంద్రంను పరిశీలించి , నామినేషన్ ప్రక్రియను గురించి తెలుసుకొని , పోలీస్ సిబ్బంది కి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని , అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ని పాటించాలని , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆయన వెంట నిజామాబాదు ఎ.సి.పి బి. ప్రకాష్ , టౌన్ 4 ఎస్.హెచ్.ఓ సతీష్ కుమార్, ఆర్.ఓ వెంకటేష్ , ఏ.ఆర్.ఓ రమేష్ గౌడ్ వారి సిబ్బంది పాల్గొన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >