| Daily భారత్
Logo




ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది జడ్జీలు

News

Posted on 2026-01-31 18:29:01

Share: Share


ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది జడ్జీలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారతీయ న్యాయ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లతో సతమతమవుతోంది. దేశంలో ప్రతీ 10 లక్షల మందికి కేవలం 22 మంది న్యాయమూర్తులు ఉన్నారు.న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఉండాల్సిన సంఖ్య కన్నా ఇది తక్కువ. సకాలంలో న్యాయం జరగాలంటే జనాభాకు తగినంత మంది జడ్జీలు లేరని తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 2026 నాటికి ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని లెక్కించినట్లు కేంద్రం తెలిపింది.అధికారిక వివరాల ప్రకారం, సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు గానూ ప్రస్తుతం 33 మంది మాత్రమే ఉన్నారు. హైకోర్టులో 1122 మంది న్యాయమూర్తులు ఉండాలి, కానీ ప్రస్తుతం 814 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అత్యధిక కేసులు జిల్లా, దిగుమ కోర్టుల్లోనే ఉన్నాయి. ఈ కోర్టుల్లో 20,833 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. అయినా కూడా పెండింగ్ కేసులు తగ్గించడానికి ఈ సంఖ్య సరిపోవడం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.


ప్రధాన కోర్టుల్లో గణనీయంగా న్యాయమూర్తుల కొరత ఉంది. లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 120వ నివేదికలో ప్రతీ 10 లక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని సూచించింది. ఈ సంఖ్యలో సగం కూడా ప్రస్తుతం లేరు. కొర్టులపై ఉన్న ఒత్తిడి జైళ్లలో కనిపిస్తోంది. నేషనల్ క్రైమ్ బ్యూర్(NCRB) ప్రకారం, 2023 నాటికి 3,89,910 మంది అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్లలో ఉన్నారు. సత్వర న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. కోర్టుల మౌలిక సదుపాయాలను మెరుగుపరడచంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాకారంతో పాటు పారదర్శకతను మెరుగుపరచడానికి ఈ-కోర్టులు మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ద్వారా టెక్నాలజీని తీసుకువస్తోంది.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >