Posted on 2026-01-31 18:29:46
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రశాంతమైన వాతావరణం లో సమర్థవంతంగా అధికారులు మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్, వాటర్ బోర్డు ఎగ్జిక్యూట్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ ఐఏఎస్ తో కలిసి షాద్ నగర్ మున్సిపాలిటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులతో కలెక్టర్ నారాయణరెడ్డి, మయాంక్ మిట్టల్ లు ఎన్నికల ప్రక్రియను సమీక్షించారు . స్క్రూటీనిలో ప్రతి నామినేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అనంతరం రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను వారు పరిశీలించారు. షాద్ నగర్ మినీ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్, ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సునీత రెడ్డిని మున్సిపాలిటీలో వార్డుల, పోలింగ్ స్టేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో స్క్రూటీని దాదాపు పూర్తిగా వచ్చిందని తెలిపారు. అప్లికేషన్ లు తిరస్కరిస్తే అభ్యర్థులు రేపు అప్పిల్ చేసుకోవచ్చని అన్నారు. ఆమోదించిన నామినేషన్లను మంగళవారం మూడో తేదీ సాయంత్రం మూడు గంటల వరకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. సాయంత్రం మూడు గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు చిహ్నాలను ప్రకటన ఇస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో 126 వార్డులకు సంబంధించి 324 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలను నిర్వహించనున్నామని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమాలు ప్రకారం వ్యవహరించాలని, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దని సూచించారు. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి టీ.హరీష్, షాద్ నగర్ ఆర్డీవో సరిత, ఫరూఖ్ నగర్ తహశీల్దార్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >