Posted on 2026-02-08 16:08:38
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతిరెడ్డి పద్మ రాంరెడ్డి
డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో తనని గెలిపిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తానని 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దొంతిరెడ్డి పద్మ రాంరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని 4వ వార్డులో గడపగడపకు తిరుగుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పద్మ రాంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం ఉపాధి జరుగుతుందని అన్నారు.చేయి గుర్తుపై అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు తాను నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వార్డులో డ్రైనేజీ,సీసీ రోడ్లు, వీధిలైట్లు, మంచినీరు తదితర సమస్య లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రజల రక్షణ కోసం వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. బూత్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ప్రణాళికతో సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థులను మరియు పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర ప్రతాప్ రెడ్డి, దాసా నాగేశ్వర్రావు, ఆంజనేయులు, శివ తదితరులు పాల్గొన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >