Posted on 2026-02-09 18:02:32
ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ల ఆవిష్కరణ
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆద్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారం సంద ర్భంగా రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సభ్యుల సమక్షంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జనాభాలోని వివిధ వర్గాలలో ఆర్థిక అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారాన్ని అమలు చేస్తుందని వివరించారు. ఈ నెల 09 వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కేవైసీ - సురక్షిత బ్యాంకింగ్కు మీ మొదటి అడుగు అనే థీమ్తో పాటించాలని ప్రతిపాదించారని తెలిపారు. నో యువర్ కస్టమర్ (కేవైసీ), సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ (సీకేవైసీ కేవైసీ సంబంధిత మోసాలు మనీ మ్యూలింగ్కు వ్యతిరేకంగా జాగ్రత్తలతో సహా, ఖాతా క్రమశిక్షణను పాటించడం, ప్రజలలో అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం) సమన్వయంతో జిల్లాస్థాయిలో అనేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఆర్బీఐ, బ్యాంకులు ఎప్పుడూ మెయిల్లు, ఎస్ఎంఎస్ లు పంపదు లేదా బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్లు మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని అడిగే కాల్లు చేయదని స్పష్టం చేశారు. వివిధ సోషల్ మీడియాల ద్వారా మొబైల్ ఫోన్లకు వచ్చే ఆఫర్లు, లింకులు, ఫోన్లకు స్పందించ వద్దని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు ఉన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >