Posted on 2026-02-16 18:48:02
డైలీ భారత్, హుజూర్ నగర్: కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడిగా గెల్లి రవి ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన నాయకత్వంలో పట్టణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నాయకులు మరియు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడు గెల్లి రవి మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా తీసుకొని పనిచేస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని పట్టణంలో మరింత బలపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శక రాజకీయాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు గెల్లి రవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >