Posted on 2026-02-20 18:52:43
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అందే మోహన్ లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం వారిని సీనియర్ నాయకులు ఎం.డి. ఇబ్రహీం పలువురు ముఖ్య నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎం.డి. ఇబ్రహీం మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన నాయకులు మున్సిపల్ బాధ్యతలు చేపట్టడం సంతోషకరమని, వారి నాయకత్వంలో షాద్నగర్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. పట్టణంలోని మౌలిక సదుపాయాల కల్పనలో నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇసాక్, ముబారక్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >