Posted on 2026-02-25 19:53:36
డైలీ భారత్, నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా మల్లన్న జాతరలో రెండు సంవత్సరాల చిన్నారిని కాలుతో తన్ని చంపిన సర్పంచ్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు నేరెళ్ల రమేష్ డిమాండ్ చేశారు.
చిన్నారి మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నాగర్ కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో చంద్రకళ కుటుంబాన్ని దర్శనానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని ఆ కుటుంబం పై దాడి చేసి 2 నెలల చిన్న పాప అని చూడకుండా విచ క్షణా రహితం గా కొట్టి ,దాడి చేసి అభం శుభం తెలియని పసి కందు ప్రాణం తీసిన సర్పంచ్ పై హత్య కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారందరి పైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని, అని అన్నారు.డబ్బు కులాహంకారంతో విర్రవీగుతున్న ఇలాంటి వారిపై అధికారులు,ప్రభుత్వం, నిష్పక్షపాతంగా విచారణ చేసి, దోషులను బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో రజక సంఘం పట్టణ అధ్యక్షులు సుంకర అజిత్ కార్యదర్శి భూష రాజు పట్టణ నాయకులు రాచర్ల సర్వీస్ కనకారావు పోషి ఉల్లెంగల రమేష్ హరి సిపిఐ మహిళా సంఘం నాయకురాలు కరిష్మా రత్నకుమారి రజక సంఘం నాయకురాలు సత్తెనపల్లి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >