| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఎంఓ (CMO) అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

News

Posted on 2026-02-26 20:20:41

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఎంఓ (CMO) అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

బెట్టింగులు అలవాటు పడి సులభ మార్గంలో డబ్బుల కోసం మోసాలు

నిందుతునిపై పలు జిల్లాలో 10 కి పైగా కేసులు నమోదు

వివరాలు వెల్లడించిన వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి.

డైలీ భారత్, వేములవాడ: రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్ మండలం కుంట్లూర్ ప్రాంతానికి చెందిన రాయబండి సూర్య ప్రకాష్ అనే వ్యక్తి రామోజీ ఫిలిమ్ సిటీ సమీపంలోని ప్రైవేట్ సంస్థల్లో ఆఫీస్ బాయ్‌గా పనిచేసేవాడు.

సూర్య ప్రకాష్ మలక్‌పేట్ ప్రాంతంలో గుర్రపు పందేలపై బెట్టింగ్ ఆడే అలవాటు ఉండటంతో అఫిస్ బాయ్ గా చేసే వస్తే డబ్బులు సరిపడక  ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడలనుకున్నాడు.ఈ క్రమంలో హయత్‌నగర్ పరిధిలో మూడు మోటార్ సైకిళ్లను దొంగిలించగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 

సూర్యప్రకాష్ జైలు నుండి వచ్చిన అనంతరం CMO కార్యాలయంలో పని చేస్తా అంటూ ప్రభుత్వ అధికారులకు ఫోన్ కాల్స్ చేసి బేధరింపులకు పాల్పడటం  ప్రారంభించాడు.ఈక్రమంలో తెల్సిన వార్తాపత్రికల ద్వారా ప్రభుత్వ అధికారుల ఫోన్ నంబర్లు సేకరించి వారికి కాల్ చేస్తూ నేను CMO కార్యాలయం నుండి మాట్లాడుతున్న అంటూ అందరూ అధికారులు డబ్బులు చెల్లిస్తున్నారు మీరు కూడా కట్టాలి అంటూ భయపెట్టి, తన ఫోన్‌పే కు డబ్బు పంపాలని, లేనిపక్షంలో అధికారిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించేవాడు.ఈ విధంగా కొంతమంది ప్రభుత్వ అధికారుల నుండి డబ్బు సేకరించి,ఆ మొత్తాన్ని గుర్రపు పందేల బెట్టింగ్‌లో ఖర్చు చేశాడు.

పై సమస్యలపై సూర్యప్రకాష్ పై  హైదరాబాద్ లోని ccs పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు,హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు,సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు,జగిత్యాల లో ఒక కేసులో  అరెస్ట్ కాబడి, జైలు కి వెళ్లడం జరిగింది.

సూర్యప్రకాష్ తేదీ 23.02.2026 సాయంత్రం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టు డీఈఈ అయిన రఘుపతి కి కాల్.చేసి తాను సిఎంఓ కార్యాలయం నుండి మాట్లాడుతున్నానని డబ్బు డిమాండ్ చేశాడు. అయితే సంబంధిత అధికారి ఎలాంటి డబ్బు చెల్లించకపోగా   బోయినపల్లి పోలీస్ వారిని సంప్రదించగా సూర్యప్రకాష్ పై బోయినపల్లి ఎస్.ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాగా రఘుపతి నుండి నేరుగా డబ్బులు  తీసుకోవడానికి  కొడురుపాకకు వస్తుండగా సాంకేతికత ఆధారంగా బోయినపల్లి పోలీస్ వారు నిందుతున్ని ఈరోజు కోదురుపాక వద్ద అరెస్ట్ చేసి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది అని ఏఎస్పీ రుత్విక్ సాయి తెలిపారు.

నిందుతుని వివరాలు.

1.Rayabandi Surya Prakash Chary, s/o Bhaskarachary, age: 45 yrs,Kuntloor, Hayathnagar, Rangareddy Dist,

నిందుతున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమాకాంత్, కానిస్టేబుల్ కోటి, అచ్యుత్,వెంకటేష్, తేజ లను ఏఎస్పీ అభినందించారు.

Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >