| Daily భారత్
Logo




కామారెడ్డి పట్టణ వైశ్యుల అనైక్యత వల్లనే మున్సిపల్ ఎన్నికలలో విఫలం

News

Posted on 2026-03-02 16:03:43

Share: Share


కామారెడ్డి పట్టణ వైశ్యుల అనైక్యత వల్లనే మున్సిపల్ ఎన్నికలలో విఫలం

రాజకీయ అభివృద్ధి తోనే వైశ్యులకు సామాజిక గౌరవం సాధ్యం

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐవిఎఫ్ నూతన కమిటీ అభినందన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్యుల అనైక్యత వల్లనే మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో వైశ్య అభ్యర్థులను గెలిపించు కోలేకపోయామని,ఆర్థికంగా ఎంత ఉన్నత స్థితికి ఎదిగిన రాజకీయంగా తగిన గుర్తింపు లేకపోతే సామాజిక గౌరవం వైశ్యులకు ఉండదని అన్నారు. మన ఉనికినే మనం కోల్పోతే సమాజంలో మనకు ఎలాంటి సహాయ సహకారాలు పొందడం సాధ్యం కాదని అన్నారు.

కామారెడ్డి మున్సిపల్ గత చరిత్రను పరిశీలిస్తే 15 సంవత్సరాలపాటు మున్సిపల్ చైర్మన్ లుగా అవకాశం కలిగిందని, గతంలో కామారెడ్డి మున్సిపాలిటీలో 6 గురు నుండి 8 మంది కౌన్సిలర్ లుగా గెలుపొందితే ఈ సారి ఒక్కరు మాత్రమే గెలుపొందడం చూస్తే రాజకీయంగా వైశ్యులు విఫలం కావడమే అని అన్నారు.ఇప్పటికే అవకాశాలు లేక రాజకీయంగా వెనుకబడి ఉన్నామని రాజకీయ అధికారంతోనే వైశ్యులకు మరింత గుర్తింపు లభిస్తుందని అన్నారు, సామాజిక సేవలో దేశంలోనే ఎవ్వరూ చేయని సేవలు వైశ్యులు చేస్తుంటే రాజకీయ అభివృద్ధిలో మాత్రం అట్టడుగు స్థాయిలో మిగిలిపోతున్నామని దానికి వైశ్య పెద్దలు బాధ్యత తీసుకుని భవిష్యత్తు వైశ్య తరాలకు ఆదర్శవంతమైన రాజకీయ అవకాశాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

వైశ్యుల రాజకీయ అభివృద్ధికి అవసరమైతే పార్టీలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు కదలాలని,కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాల పరిస్థితి మరొక మారు వస్తే రాజకీయ భవిష్యత్తు కామారెడ్డిలో శూన్యంగా మారుతుందని అన్నారు.

ఐవిఎఫ్ చేస్తున్న సేవలను గుర్తించి ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి దొంతుల సుధాకర్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు లకు సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లోనే మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను ఐవిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు.


ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు అధ్యక్షులు శెనిశెట్టి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి జూలూరి గంగాధర్,కోశాధికారి సోమిశెట్టి ఆంజనేయులు,ప్రోగ్రాం చైర్మన్ జక్సాని సంతోష్ మరియు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >