Posted on 2026-03-10 19:34:32
నీల నాగరాజు బీసి సంఘం జిల్లా అధ్యక్షులు..
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి 129 వర్ధంతి సందర్భంగా బీసి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలేని సామాజికంగా చదువుల తల్లిగా కొలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఆమె ఒక విప్లవ నాయకురాలు సంఘసంస్కర్త.భారత దేశంలో మహిళా సాధికారత ప్రతిరూపం.
సావిత్రిబాయి పూలే విద్యారంగానికి మరియు సామాజిక న్యాయంగానికి చేసిన విశిష్ట సేవలకు విద్యామాతగా కీర్తించబడ్డారు.ఆమె తన భర్త జ్యోతిరావు పూలే తో కలిసి కఠినమైన సామాజిక నిబంధనలు మరియు పక్షపాతాలను ధిక్కరిస్తూ భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసింది. బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే 1848 లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించింది.అది భారతదేశంలోని మహిళల విద్య కోసం ప్రారంభించిన సాహసోపేతమైన అడుగు అని అణిచివేతకు వ్యతిరేకంగా విద్యని విముక్తి సాధనంగా స్వీకరించాలని కోరుతూ అట్టడుగు వర్గాలను ప్రేరేపించడానికి ఆమె శక్తివంతమైన రచనలను,కవిత్వాలను రచించారు.
మహిళలకు విద్య నిషిద్ధమని భావించిన కాలంలో సావిత్రిబాయి బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను ప్రారంభించడం ద్వారా వారి కోసం సమాజంలో విద్యా అందరి హక్కు అని తెలియపరిచారు. సామాజిక నిబంధనలను ధిక్కరించింది మరియు విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంది కానీ తన లక్ష్యంతో స్థిరంగా ముందుకు కదిలింది.
మీరు ఒక పురుషునికి విద్యానందిస్తే మీరు ఒక వ్యక్తికి విద్యను అందిస్తారు. కానీ మీరు ఒక స్త్రీకి విధ్యను అందిస్తే, ఒక కుటుంబాన్ని మరియు దేశాన్ని విద్యావంతులను చేస్తారు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సంక్షేమ సంఘం అధ్యక్షులు సాప శివరాములు,ప్రధాన కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్,ఎస్. దయాకర్,జబ్బార్ నాయక్,వినోద్ నాయక్,ప్రవీణ్,సురేష్,అర్చన,భార్గవి తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >