Posted on 2026-03-16 08:32:23
డైలీ భారత్ స్పెషల్: శీర్షిక: ప్రజా ఐక్యత గీతం
పర్వత శిఖరములపై పలికిన కవితా నాదమది
పృథ్వీ గర్భమంతట పరిమళించి విరజిల్లె;
భాషల గోడలన్నియు భగ్నమగునని బోధించి
భావాల సేతువై మానవ హృదయములను కలిపె.
కులమత భేదముల కలుషిత చీకటిలో
కరుణా కాంతిరేఖలై కవిత వెలుగె;
విభేద వలయముల విరిచి సమత్వ మార్గమున
సామరస్య సుగంధమై సమాజమున పరచె.
పేదవాని నిశ్వాసము, ధనవాని గర్వగీతము
ఒకే రాగమై కలిసిన క్షణమున
సమానత్వ సత్యమై సమాజ గర్భమందు
స్నేహ స్వరమై సర్వలోకమున మార్మోగె.
సరిహద్దు రేఖలతో భూమిని చీల్చిన చేతులకన్నా
స్నేహసూత్రమే శాశ్వతమని కాలమే చెప్తుంది;
మనసుల నదులన్నియు ఒకే సముద్రమై చేరగా
మానవత్వమే జగతికి మహాసంగీతమవుతుంది.
కావున కవిత కేవలం పదాల అలంకారముకాదు—
ప్రజల హృదయాలను కలిపే పవిత్ర జ్యోతి అది;
ప్రపంచ కవితా స్వరమై మార్మోగిన వేళ
ప్రజల ఐక్యత రాగమే భూమికి శాశ్వత గీతమవుతుంది.
రచన: మంజుల పత్తిపాటి
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >