Posted on 2026-03-19 21:52:18
వేములవాడ దేవస్థానానికి గౌరవం
డైలీ భారత్, హైదరాబాద్: ఈరోజు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉగాది పురస్కారాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ప్రముఖులు పురస్కారాలు అందుకోవడం విశేషంగా నిలిచింది.
దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వర్ సురేష్ , అలాగే నాదస్వర కళాకారుడు ఎన్. శ్రీనివాస్ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఈ పురస్కారాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ ఎం. హనుమంతరావు, ఐఏఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉగాది పురస్కారాలను అందుకున్న దేవస్థానం సిబ్బందికి ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎల్. రమాదేవి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దేవస్థానం ప్రతిష్ఠ మరింత పెరిగిందని భక్తులు మరియు అధికారులు అభిప్రాయపడ్డారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >