Posted on 2026-03-19 21:52:18
వేములవాడ దేవస్థానానికి గౌరవం
డైలీ భారత్, హైదరాబాద్: ఈరోజు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉగాది పురస్కారాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ప్రముఖులు పురస్కారాలు అందుకోవడం విశేషంగా నిలిచింది.
దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వర్ సురేష్ , అలాగే నాదస్వర కళాకారుడు ఎన్. శ్రీనివాస్ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఈ పురస్కారాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ ఎం. హనుమంతరావు, ఐఏఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉగాది పురస్కారాలను అందుకున్న దేవస్థానం సిబ్బందికి ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎల్. రమాదేవి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దేవస్థానం ప్రతిష్ఠ మరింత పెరిగిందని భక్తులు మరియు అధికారులు అభిప్రాయపడ్డారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >