Posted on 2026-03-21 11:38:50
రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంజాన్ పండుగ సందర్భంగా షాద్ నగర్ ఈద్గా వద్ద మైనారిటీ సోదరులను కలుసుకుని రంజాన్ పండుగ ముబారక్ తెలుపుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశం. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ..రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >