Posted on 2026-03-21 08:31:06
డైలీ భారత్, హైదరాబాద్ : హుక్కా సెంటర్లే లక్ష్యంగా ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య మెరుపు దాడులు నిర్వహించారు. నాగోల్,ఎల్బీనగర్ పరిధిలోని హుక్కా సెంటర్లపై జరిగిన ఈ దాడుల్లో భారీగా హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, మొత్తం 37 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో ఉన్న సేహరి కేఫె హుక్కా సెంటర్ పై ఏసీపీ కృష్ణయ్య తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేశారు. స్థానిక నాగోల్ సీఐకి కూడా సమాచారం లేకుండా నేరుగా రంగంలోకి దిగిన ఏసీపీ, అక్కడ హుక్కా సేవిస్తున్న 25 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి భారీగా హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఎల్బీనగర్లోని "ఎల్వోసి" హుక్కా సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా హుక్కా నిర్వహిస్తున్నట్లు గుర్తించి, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.అదుపులోకి తీసుకున్న యువకుల నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు, నివేదిక ఆధారంగా తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.మూడు రోజుల క్రితం జరిగిన దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక సెక్టార్ ఎస్ఐకి ఇప్పటికే ఛార్జ్ మెమో జారీ చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా, నిబంధనలు ఉల్లంఘించి హుక్కా సెంటర్లు నడిపినా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >