| Daily భారత్
Logo




భక్తి శ్రద్దలతో పెద్దమ్మ తల్లి కొలుపు

News

Posted on 2026-03-23 08:26:49

Share: Share


భక్తి శ్రద్దలతో పెద్దమ్మ తల్లి కొలుపు

ఊరేగింపులో భారీగా పాల్గొన్న గ్రామస్తులు

అగ్ని పునీతం చేసి తమ భక్తి ని విశ్వాసాన్ని చాటిన ఆదివాసీలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడుఆదివాసి నాయక పోడుల కుల దేవత పెద్దమ్మతల్లి కొలుపు కార్యక్రమాన్ని మండల పరిధి పడమట నర్సాపురం గ్రామంలో అత్యంత భక్తి శ్రద్దలతోటి నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు సాగిన పెద్దమ్మ తల్లి కొలుపు కార్యక్రమం ఆదివారం కొండాలు తొక్కుటతో ముగిసింది. శనివారం సాయంత్రం భారీ భక్త జన సందోహం నడుమ గ్రామ ప్రధాన వీధులలో సరువుల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి ఆదివాసి నాయక పోడు కుల పూజారులు తమ సంస్కృతి, సాంప్రదాయ, ఆచారాలతో గణాసారులు, దేవర బాలల ఆధ్వర్యంలో  పట్నాలు ఏసి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం పోతురాజు శిరస్సును జలధిలో కలిపి స్నానాలను ఆచరించిన అనంతరం రాజుకి పెద్దమ్మ తల్లికి గ్రామ పేరంటాల నడుమ లేళ్ళ సత్యనారాయణ రెడ్డి, కమలమ్మ దంపతుల కుమారులు లేళ్ళ అప్పిరెడ్డి, నాగిరెడ్డి దంపతులచే అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం రాజు, పెద్దమ్మతల్లి, పోతురాజు, బోనాలతో పూజారులు, గణ బాలలు, దేవర బాలలు, యువకులు, మహిళలు (కొండాలు తొక్కి) అగ్నిగుండంలోనీ నిప్పులపై నడచి, అగ్ని పునీతమై తమ దేవతలపై ఉన్న భక్తిని, నమ్మకాన్ని, తమ ఆచార సాంప్రదాయాలను చాటారు. ఇలా కొలుపు చేయడం ద్వారా గ్రామంలోనీ ప్రజలు, పశువులు, పంటలు వృద్ధి చెంది సుభిక్షంగా ఉండటంతో పాటు, అంటువ్యాధుల భారి నుండి అతివృష్టి అనావృష్టి నుండి ఆ తల్లి కాపాడుతుందని, ప్రతి పనిలో విజయం సాధిస్తామని ఆదివాసీల నమ్మకం. ఆదివారం కొలుపు ముగింపు అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పెద్దమ్మ తల్లి కొలుపు అనంతరం గ్రామస్తులతోపాటు, ఇతర గ్రామాల భక్తులు అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతోపాటు, పరిసర, సుదూర ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >