| Daily భారత్
Logo




మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు...

News

Posted on 2026-03-23 19:00:13

Share: Share


మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు...

జిల్లాలో ఒకే రోజు 105 మందికి కోర్టు శిక్షలు

05 మందికి రెండు రోజు జైలు శిక్ష, 9 మందికి ఒక  రోజు జైలు శిక్ష,  రూ.1,27,500 జరిమానా విధింపు

మీ భద్రతే మా లక్ష్యం.. మద్యం మత్తులో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయం – జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 

జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడం మరియు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పెద్ద సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డారు.

వీరిలో 105 మందిని ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జరిమానాలు మరియు జైలు శిక్షలు విధించింది. 05 మందికి రెండు రోజుల జైలు శిక్ష, 9 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి కలిపి మొత్తం రూ. 1,27,500 జరిమానా విధించడం జరిగింది. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు ఇటువంటి బాధ్యతారాహిత్యపు పనులను అరికట్టడానికి పోలీస్ శాఖ ఈ కఠిన చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం కేవలం చట్టవిరుద్ధమే కాకుండా, తోటి ప్రయాణికుల మరియు పాదచారుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టడమేనని తీవ్రంగా హెచ్చరించారు. క్షణికానందం కోసం మద్యం మత్తులో వాహనాలు నడిపి, నిండు జీవితాలను రోడ్డు ప్రమాదాల పాలు చేసుకోవద్దని ఆయన వాహనదారులకు సూచించారు. ఒక వ్యక్తి చేసే ఈ చిన్న పొరపాటు వల్ల ఎన్నో కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

"మీ భద్రతే మా లక్ష్యం" అని పేర్కొన్న ఎస్పీ గారు, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బాధ్యతాయుతమైన ప్రయాణమే మీ కుటుంబ భవిష్యత్తుకు అసలైన భరోసా అని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి రోడ్డు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >