Posted on 2026-03-23 20:38:11
డైలీ భారత్,వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27-03-2026 శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈసారి ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు సౌకర్యంగా కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 15 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్యక్రమాన్ని భక్తులు స్పష్టంగా వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే భద్రతా దృష్ట్యా బ్యారికేడ్లు, ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు నడవడానికి గ్రీన్ మ్యాట్లు పరచనున్నారు.
భక్తుల కోసం త్రాగునీరు, మజ్జిగ వంటి పానీయాలు అందుబాటులో ఉంచనున్నారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
అదేవిధంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, టెంట్లు, విద్యుత్ దీపాలు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు స్వామివారి అన్నప్రసాదం పంపిణీ కూడా నిర్వహించనున్నారు.
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో ఎల్. రమాదేవి ఆలయ ఉద్యోగులకు సూచించారు.
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >
ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు
Posted On 2026-04-27 18:49:15
Readmore >
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు
Posted On 2026-04-27 18:47:54
Readmore >
కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి
Posted On 2026-04-27 18:46:32
Readmore >