Posted on 2026-03-26 08:15:25
డైలీ భారత్, కామారెడ్డి: రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC)ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించి సేవల నిర్వహణపై తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, రోగులకు అందుతున్న సౌకర్యాలు, హాజరు రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో శుభ్రత, వైద్య సిబ్బంది సమయపాలన, రోగుల పట్ల వ్యవహార శైలి వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో వైద్యాధికారి సాయి ఈశ్వరి, సంబంధిత వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్హెచ్ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >