Posted on 2026-03-26 08:17:09
డైలీ భారత్, రామాంతాపూర్: రామాంతాపూర్ పరిధిలోని వెంకట సాయి నగర్ కాలనీకి చెందిన మల్లెపల్లి మహేష్ గౌడ్ కుమారుడు అజయ్కు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.60000వేల ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ మేరకు ఎల్టీసీ పత్రాన్ని కాలనీ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మరియు కాలనీ గౌరవ సభ్యులు వారి బృందం సభ్యులు కలిసి బాధితుడి తండ్రి మహేష్ గౌడ్ కు అందజేశారు.
ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సహకారంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం ఎల్ఓసీ (LOC) పొందడంతో పాటు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరయ్యిందని తెలిపారు.
ఈ సందర్భంగా బాధితుడికి నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రమేష్ గౌడ్, సలహాదారులు రవి ,సంజీవ, స్వామి, శంకర్, టీం సభ్యులు ఆర్. గోవింద్, అశోక్, నవీన్, రామకృష్ణ , విద్యాసాగర్, నరసింహ, శివ , శ్రీనివాస్ గౌడ్, ఐలేష్ యాదవ్, వీర బ్రహ్మచారి ,మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >