Posted on 2026-03-30 17:33:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు గోకుల్ రామారావు హర్షం వ్యక్తం చేశారు.సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా న్యాయవాదులపై వివిధ రకాల దాడులు, హత్యలు, హత్యాయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తమకు రక్షణ చట్టం కావాలని నిరంతరం పోరాటం కొనసాగించారని పేర్కొన్నారు.
న్యాయవాదుల రక్షణ చట్ట అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం, ఈరోజు అసెంబ్లీలో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం ఆనందకరమైన విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు.రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు విప్లవ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదుల దీర్ఘకాలిక డిమాండ్ను నెరవేర్చుతూ ప్రభుత్వం ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావడం హర్షణీయమని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శి వోద్యారపు రవికుమార్, ఉపాధ్యక్షుడు బొడ్డు రమేష్ కుమార్,స్రవంతి,వోద్యారపుస్వప్న, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >