Posted on 2026-03-31 17:12:14
మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని విజయవాడ తరలించాము
మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
డైలీ భారత్, కృష్ణా జిల్లా: గతేడాది అక్టోబరు నెలలో అక్రమంగా టపాసులు నిల్వ ఉంచిన వారి దగ్గర నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నామని, వాటిని మంగళవారం కోర్టులో సబ్మిట్ చేయటానికి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసిన క్రమంలో పేలినట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మంగళవారం చల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలి ఐదుగురికి గాయాలు కావటంతో సంఘటనా ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీజ్ చేసిన టపాసులను కోర్టులో సబ్మిట్ చేసే క్రమంలో కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఎస్ఐ దుర్గాంజనేయులుకు స్వల్ప గాయాలు కాగా, ముగ్గురిని విజయవాడ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ పార్వతీ, హెడ్ కానిస్టేబుల్ తేజ చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్ కు దూరంగా ఉంచటం జరిగిందని, కోర్టు ఆర్డర్స్ రావటంతో వాటిని కోర్టులో సబ్మిట్ చేయటానికి తీసిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాదమికంగా నిర్ధారించటం జరిగిందన్నారు. రాష్ట్ర హోం మంత్రి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత లు తీసుకుంటామని తెలిపారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >