Posted on 2026-04-01 18:52:44
తల సేమియా వ్యాధి చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ధర్మరావుపేట గ్రామంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ షేక్ ఉమర్,ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి, వార్డు సభ్యులు,యువజన సంఘాల సహకారంతో నిర్వహించిన రక్తదాన శిఖరం విజయవంతం కావడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు తెలియజేశారు.47 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న రక్తదాత సామల సంతోష్ రెడ్డి ని సన్మానించడం జరిగింది.ఈ రక్తదాన శిబిరంలో 51 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు, ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ షేక్ ఉమర్,ఉప సర్పంచ్ లు,యువ పాలకవర్గం తలసేమియా వ్యాధి చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కామారెడ్డి జిల్లాకే ఆదర్శంగా నిలవడం జరిగిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ చిన్నారులకు ప్రతి 15 రోజులకు రక్తం జీవితాంతం అవసరం ఉంటుందని వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉన్నదని అన్నారు.రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను, స్టీల్ వాటర్ బాటిల్ లు,టిఫిన్ బాక్స్ లను అందజేసిన దాతలు కమ్మరి ప్రవీణ్,దోమకొండ శ్రీనివాస్,మందుల రామచంద్రం లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్,కోశాధికారి కస్వ వెంకన్న,ఎల్లంకి సుదర్శన్,నంగునూరి కాశీనాథం గ్రామ యువత పాల్గొనడం జరిగింది.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >