Posted on 2026-04-02 06:54:11
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓబీసీ నాయకులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆకుల నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కెరటం యుద్దనౌక సర్వాయి పాపన్న గౌడ్ బహుజన రాజ్యాధికారం గురించి 300 సంవత్సరాల క్రితం పోరాడిన మహనీయుని ఈ సందర్భంగా తలుచుకోని భావితరాలకు ఆయన చరిత్రను తెలియజేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా భారతదేశంలో కూడా ఈయన పోరాటపటివను గుర్తించి భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మండల అధ్యక్షుడు శీలం విద్యాసాగర్,మాజీ చెంచుపల్లి మండల అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు,తెళ్ళాం నరసింహారావు దొర,పట్టణ మహిళా నాయకురాలు గూడ విజయ,భూక్య పూర్ణ కూడా విజయ,డాక్టర్ సుధాకర్, సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి రామారావు,సీనియర్ నాయకులు సువర్ణకంటి మోహన్ రావు గౌడ్,బానోత్ గణేష్ నాయక్,నునావత్ రమేష్,గొడుగు శ్రీధర్ యాదవ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >