Posted on 2026-04-03 10:06:21
డైలీ భారత్, రామంతాపూర్ / ఉప్పల్ :వెంకట సాయి నగర్ కాలనీలో కొంతకాలంగా ఇంటి వ్యర్థాలు, చెత్త రోడ్డుపై పడేయడం వల్ల రహదారులపై వాహనాలు జారిపడే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను కాలనీ ప్రజలు కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో ఏ. విజయేందర్ రెడ్డి తన కమిటీ సభ్యులతో కలిసి సమస్య ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన శానిటేషన్ విభాగం సిబ్బంది రోడ్లను ఊడ్చి శుభ్రపరిచి, కాలనీ ప్రజలకు ఉపశమనం కలిగించారు.
ఈ సందర్భంగా స్పందించి పని చేసిన శానిటేషన్ డీఈ, ఏఈ, సూపర్వైజర్, జవాన్లు, శానిటేషన్ కార్మికులకు కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా కాలనీ పరిశుభ్రతకు సహకరించిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
అలాగే కాలనీ ప్రజలు కూడా ఇంటి చెత్త, వ్యర్థాలను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతను పాటించి కాలనీని శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >