Posted on 2026-04-03 19:03:07
మంజుల పత్తిపాటి
డైలీ భారత్ స్పెషల్:
శీర్షిక: మనసు ఎక్కడ పోయింది?
పొద్దున్నే మోగింది అలారం…
కానీ లేచేది మనసు కాదు,
ఫోన్ స్క్రీన్ వెలుగే ముందుగా
కళ్లలో ఉదయాన్ని నింపుతోంది…
వేల కాంటాక్టులు ఫోన్లో ఉన్నా
ఒక మనసు మాత్రం కాల్ చేయదు –
“ఎలా ఉన్నావు?” అని అడిగే
ఆ ఆత్మీయ స్వరం మాయమైంది…
ఇంటి గోడలు పెరిగాయి,
కానీ గది నవ్వులు తగ్గాయి…
డైనింగ్ టేబుల్ పెద్దదైంది,
కానీ కలిసి తినే మనుషులు చిన్నబడ్డారు…
సెల్ఫీలు వేలకొద్దీ,
కానీ సంతోషం ఒక్కటే లేదు…
సోషల్ మీడియాలో చిరునవ్వు,
జీవితంలో మాత్రం నిశ్శబ్దం…
బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది,
కానీ నిద్ర తగ్గుతోంది…
పదవులు ఎక్కుతున్నాం,
కానీ శాంతి దిగిపోతోంది…
ఒక రోజు…
అద్దంలో మనమే మనల్ని అడిగాం –
“ఇంత పరుగెత్తింది ఎవరి కోసం?”
జవాబు రాకపోయినా,
కళ్లలో నీళ్లు వచ్చాయి…
ఆ రోజు తెలిసింది –
డబ్బు జీవితం కాదు…
మనుషులే జీవితం…
మనసే నిజమైన సంపద…
రచన మంజుల పత్తిపాటి( కవయిత్రి)
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >