Posted on 2026-04-04 10:44:17
డైలీ భారత్, వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రుద్రాక్ష మహేష్ శుక్రవారం రాత్రి వెల్దండ నుంచి కారులో బయల్దేరాడు. ఈ క్రమంలో ఓ టిప్పర్ అతడి కారును ఢీకొట్టింది. కావాలనే యాక్సిడెంట్ చేసి, తరువాత రాళ్లతో మోది హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఉదయం వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై కురుమూర్తిలు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >