Posted on 2026-04-04 19:11:07
బాధితుడి నుండి నగదు మరియు ఆన్లైన్ బదిలీ ద్వారా సొమ్ము దోపిడీ
నిందితుడి నుండి పల్సర్ బైక్, కత్తి మరియు నగదు స్వాధీనం
కేసును వేగంగా ఛేదించిన కామారెడ్డి పోలీస్ బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ
వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఏఎస్పి బి చైతన్య రెడ్డి ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ పరిధిలో జరిగిన అర్ధరాత్రి దోపిడీ ఘటనను పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ, రామారెడ్డి రోడ్ సమీపంలోని చర్చి వద్ద 01.04.2026 అర్ధరాత్రి సమయంలో ఈ దోపిడీ జరిగింది.
తేదీ: 01.04.2026 నాడు అర్ధరాత్రి సమయంలో ఫిర్యాదుదారుడు గోలీ సుధీష్ కుమార్ (19 సంవత్సరాలు), విద్యార్థి, తన స్నేహితుడిని వదిలి తిరిగి వెళ్తుండగా, ఒక వ్యక్తి బైక్పై వచ్చి అతన్ని అడ్డగించి కత్తితో బెదిరించి రూ.2,000/- నగదు దోచుకున్నాడు. అదేవిధంగా ఫోన్ పే ద్వారా రూ.8,000/- బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ ఆదేశాల మేరకు, ASP బి. చైతన్య రెడ్డి కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు మరియు విచారణ ద్వారా నిందితుడిని గుర్తించారు.
ఈరోజు (04.04.2026) నమ్మదగిన సమాచారం మేరకు కామారెడ్డి గంజిలో నిందితుడిని పట్టుకొని విచారించగా, అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముందుగా ప్రణాళిక వేసుకుని అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడు.
నిందితుడి వివరాలు: శివరాత్రి నవీన్ s/o బుజ్జయ్య, వయస్సు: 25 సం:,నివాసం: ఇంద్రానగర్ కాలనీ, కామారెడ్డి.
స్వాధీనం చేసిన వస్తువులు: 1.పల్సర్ 2. స్టీల్ కత్తి 3. Realme మొబైల్ ఫోన్ 4. రూ.8,000/- నగదు
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ B. నరహరి , ASI రంగా రావు , PCs కమలాకర్, రాజు, సంపత్ లను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ అభినందించారు
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >