Posted on 2026-04-07 06:50:15
డైలీ భారత్, హైదరాబాద్: చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేస్తూ, విధుల్లో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకున్న ముగ్గురు వ్యక్తులకు గౌరవనీయ నాంపల్లి కోర్టు (I స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్) 2 రోజుల జైలు శిక్ష మరియు తలా ₹500/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నిందితులైన రజాక్ పాషా (25), హాజీ బిన్ అబ్దుల్లా (29), మరియు మహ్మద్ సాహిల్ (24) ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ విఘాతం కలిగిస్తున్నారు. చార్మినార్ ఎస్.ఐ బి. ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి వారిని ప్రశ్నించగా, నిందితులు సహకరించకుండా దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా హాజీ బిన్ అబ్దుల్లా అనే వ్యక్తి పోలీసులపైకి దూసుకువచ్చి, వారి విధులకు ఆటంకం కలిగించారు.
దీనిపై చార్మినార్ పోలీసులు ఈ-పెట్టి కేసులు (61 B CP ACT & 292 BNS ACT కింద) నమోదు చేశారు. గౌరవ మేజిస్ట్రేట్ శ్రీ ఎం. భాస్కర్ గారు 06-04-2026న ఈ కేసులను (STC No- 1837, 1838, 1839/2026) విచారించి, నేరం నిరూపితమైనందున నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు పోలీసుల విధులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చార్మినార్ ఇన్స్పెక్టర్ టి. రాంబాబు హెచ్చరించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >