Posted on 2026-04-08 16:17:15
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద మార్కండేయ ఫార్మసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిఎస్పీ నాగేంద్రచారి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రయాణికులు, స్థానిక ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని డిఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు సహాయం చేయాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఫార్మసీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >