| Daily భారత్
Logo




చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

News

Posted on 2026-04-09 16:11:13

Share: Share


చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

కురుక్షేత్ర నుండి శృంగేరి వరకు: ఆధ్యాత్మిక వేదికలపై మారుమోగిన కామారెడ్డి చిన్నారుల పేరు

శ్లోకాలతో శ్రద్ధ, జ్ఞాపకశక్తికి నిదర్శనం – చిన్నారుల ప్రతిభకు ప్రశంసలు

గీతా పఠనంతో గోల్డ్ మెడల్ సాధించిన చిన్నారులను అభినందించిన జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర, IPS

డైలీ భారత్, కామారెడ్డి: భిక్నూర్ ఎస్.ఐ. ఆంజనేయులు కుమారులు కుశాల్ మనోహర్ యాదవ్ మరియు కార్తీక్ మనోహర్ యాదవ్ లు ఆధ్యాత్మిక రంగంలో అద్భుత ప్రగతిని కనబరుస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా "గీతా పరివార్" నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతుల ద్వారా శిక్షణ పొందుతూ, భగవద్గీతలోని 18 అధ్యాయాలలో గల 700 శ్లోకాలను అనర్గళంగా కంఠతా నేర్చుకున్నారు. వీరి అకుంఠిత దీక్షకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన "గీతావ్రతి"గా గుర్తింపు పొందారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన "జ్ఞానస్మృతి" కార్యక్రమంలో తమ ప్రతిభను చాటి "Elite World Record" సర్టిఫికేట్‌ను సొంతం చేసుకున్నారు.

ఈ చిన్నారుల ప్రతిభ దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ప్రశంసలు అందుకుంటోంది. గత ఏడాది జూన్ నెలలో శృంగేరి శారదా పీఠంలో నిర్వహించిన గీతా జ్ఞాన యజ్ఞంలో పాల్గొని, జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఇటీవల హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్వహించిన "సహస్ర గీతాపఠన" కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి వచ్చిన గీతా పాఠకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు బాబా రాందేవ్ మరియు అయోధ్య రామాలయ ట్రస్టు కోశాధికారి గురు గోవింద్ గిరి చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసలు అందుకొని జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టారు.

చిన్నారులు సాధించిన ఈ అరుదైన విజయాలను తెలుసుకున్న జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర, IPS, ఈరోజు వారిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎస్పి సమక్షంలో భగవద్గీత శ్లోకాలను అత్యంత స్పష్టంగా పఠించారు. చిన్నారులు పఠించిన శ్లోకాలను శ్రద్ధగా విన్న ఎస్పి , వాటి అర్థాలను అడిగి తెలుసుకోగా.. పిల్లలు ఆ శ్లోకాల అంతరార్థాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. చిన్నారుల ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని చూసి ఎస్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించారు.

అనంతరం ఎస్.పి. గారు చిన్నారులకు స్వీట్లు తినిపించి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశీస్సులు అందజేశారు. చిన్న వయసులోనే ఇలాంటి ఉత్తమ మార్గంలో నడిపిస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ చిన్నారులు ఉన్నత స్థాయికి ఎదిగి కన్నతల్లిదండ్రుల పేరుతో పాటు కామారెడ్డి జిల్లా పేరును కూడా దశదిశలా చాటాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి కె నరసింహ రెడ్డి, భిక్నూర్ ఎస్.ఐ. ఆంజనేయులు పాల్గొన్నారు.

Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >