Posted on 2026-04-10 06:36:42
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డిలో ఎన్జీవోస్ కాలనీలో గల ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో ఆయుర్వేద హోమియోపతి యునాని వైద్య శిబిరంను 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ప్రారంభించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ క్యాంప్ చేపట్టి ఉచితంగా మందులు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మరియు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ గారి ఆదేశానుసారము ఈనెల 10వ తేదీన శుక్రవారం నాడు హోమియోపతి, ఆయుష్ డే నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, చర్మవ్యాధులు మధుమేహము, అర్షమోల, బ్లడ్ ప్రెషర్ మొదలగు దీర్ఘకాలిక అన్ని రకములైన వ్యాధులకు వైద్యులచే పరీక్షించి ఉచితంగా జరిపారు. ఆయుర్వేద, హోమియో, యునాని మందులు అందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డి ఎం హెచ్ ఓ డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ వెంకటేశ్వర్లు (ఆయుర్వేదం), డాక్టర్ మాలికా జునైడి .(హోమియోపతి ), వైద్యురాలు నహిదా తరుణ్ణం (ఆయుర్వేదం) డాక్టర్ విజయ (యునాని)డాక్టర్ దేవయ్య(ప్రకృతి వైద్యం ) కిషోర్ (ఫార్మసిస్ట్). జ్యోత్స్న(pharm) సుమలత; రాజన్న, సిబ్బంది పాల్గొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >