Posted on 2026-04-10 12:06:42
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డిలో ఎన్జీవోస్ కాలనీలో గల ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో ఆయుర్వేద హోమియోపతి యునాని వైద్య శిబిరంను 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ప్రారంభించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ క్యాంప్ చేపట్టి ఉచితంగా మందులు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మరియు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ గారి ఆదేశానుసారము ఈనెల 10వ తేదీన శుక్రవారం నాడు హోమియోపతి, ఆయుష్ డే నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, చర్మవ్యాధులు మధుమేహము, అర్షమోల, బ్లడ్ ప్రెషర్ మొదలగు దీర్ఘకాలిక అన్ని రకములైన వ్యాధులకు వైద్యులచే పరీక్షించి ఉచితంగా జరిపారు. ఆయుర్వేద, హోమియో, యునాని మందులు అందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డి ఎం హెచ్ ఓ డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ వెంకటేశ్వర్లు (ఆయుర్వేదం), డాక్టర్ మాలికా జునైడి .(హోమియోపతి ), వైద్యురాలు నహిదా తరుణ్ణం (ఆయుర్వేదం) డాక్టర్ విజయ (యునాని)డాక్టర్ దేవయ్య(ప్రకృతి వైద్యం ) కిషోర్ (ఫార్మసిస్ట్). జ్యోత్స్న(pharm) సుమలత; రాజన్న, సిబ్బంది పాల్గొన్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >