Posted on 2026-04-10 12:55:14
పెద్దూర్ లో ఉన్న కేజీబీవీ ఆకస్మిక తనిఖీ.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే సమయం కావడంతో జిల్లా కలెక్టర్ ముందుగా మెనూ చార్ట్ పరిశీలించారు. నేరుగా డైనింగ్ రూమ్ వద్దకు చేరుకొని.. ప్లేట్ తీసుకుని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. మెనూ ప్రకారం భోజనం, ఇతర ఆహార పదార్థాలు ఇస్తున్నారా అని ఆరా తీశారు. వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చదవడం, రాయడం, ప్రణాళిక సిద్ధం చేసుకోవడం తదితర అంశాలపై విద్యార్థులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచనలు చేశారు. మంచిగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >