| Daily భారత్
Logo




భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

News

Posted on 2026-04-12 10:20:08

Share: Share


భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

డైలీ భారత్, జగిత్యాల జిల్లా: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే. అయితే ఈ గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానలా మారి విడాకులకు దారితీస్తుంటాయి. కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతుంటాయి. తాజాగా జగిత్యాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించాడు అల్లుడు. వెలగటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి(48), పద్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.

కొంతకాలం వరకు సవ్వంగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత కలహాలు చోటుచేసుకున్నాయి. భార్య భర్తల మధ్య గొడవలు కాగా తన పిల్లలతో పుట్టింటికి వెళ్ళింది భార్య పద్మ. తన భార్యను పద్మ తల్లి రాజవ్వ కాపురానికి పంపడం లేదని కోపం పెంచుకొని హతమార్చలని ప్లాన్ వేశాడు అల్లుడు గాగిరెడ్డి మల్లారెడ్డి. రాజవ్వ ఇంటి తలుపులకు విద్యుత్ అమర్చాడు. ఉదయం తలుపులు తెరువగానే రాజవ్వకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. అల్లుడు మల్లారెడ్డి పై అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు వెల్గటూర్ పోలీసులు తెలిపారు.

Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >