Posted on 2026-04-12 13:50:08
డైలీ భారత్, జగిత్యాల జిల్లా: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే. అయితే ఈ గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానలా మారి విడాకులకు దారితీస్తుంటాయి. కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతుంటాయి. తాజాగా జగిత్యాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించాడు అల్లుడు. వెలగటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి(48), పద్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.
కొంతకాలం వరకు సవ్వంగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత కలహాలు చోటుచేసుకున్నాయి. భార్య భర్తల మధ్య గొడవలు కాగా తన పిల్లలతో పుట్టింటికి వెళ్ళింది భార్య పద్మ. తన భార్యను పద్మ తల్లి రాజవ్వ కాపురానికి పంపడం లేదని కోపం పెంచుకొని హతమార్చలని ప్లాన్ వేశాడు అల్లుడు గాగిరెడ్డి మల్లారెడ్డి. రాజవ్వ ఇంటి తలుపులకు విద్యుత్ అమర్చాడు. ఉదయం తలుపులు తెరువగానే రాజవ్వకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. అల్లుడు మల్లారెడ్డి పై అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు వెల్గటూర్ పోలీసులు తెలిపారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >