Posted on 2026-04-12 16:53:08
తీవ్ర విషాదం..... సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సినీ సంగీత సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన స్వరమాధురి, ప్రఖ్యాత నేపథ్య గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న ఆమె కొంతకాలంగా ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు. దేశ ప్రధాని మోదీతో సహా ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. ఆశా జీ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ పరేల్లోని ఆమె స్వగృహంలో ఉంచుతారు. అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కడసారి నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆమె గళం మూగబోవడం భారతీయ సంగీత లోకానికి ఎన్నటికీ తీరని లోటు. వేలాది మధురమైన పాటలతో శ్రోతలను అలరించిన ఆశా భోంస్లే భౌతికంగా దూరమైనా తన పాటలతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >