Posted on 2026-04-13 14:02:13
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం లో స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మండలంలోని 24 గ్రామపంచాయతీలలో ఎక్కువ మంది రైతులు యాసంగి పంటలు వడ్లు మొక్కజొన్నలు వేశారని ఆ పంటలు కోతలకు వచ్చాయని వాటిని అమ్ముకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి భానోతు ధర్మ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు
ఆరుకాలం కష్టపడి కాంప్లెక్స్ ఎరువులు దొరకక అనేక ఇబ్బందులకు గురవుతూ ఎండ తాపానికి గురి అవుతూ అనేక కష్టాలను ఎదుర్కొంటూ దిగుబడి అరకొరగా వచ్చే అవకాశం ఉన్న వాటిని సరైన మార్కెట్టు ధర పలకకపోవడంతో రైతులు దళారుల మధ్య నష్టపోయే ప్రమాదం ఉందని వారు అన్నారు రైతులు పండించిన పంటలను అమ్మబోతే అడవి కొనబోతే కొరివి మాదిరిగా ఈ ప్రభుత్వం పాలకవర్గాలు అనుసరిస్తున్నాయని దీనివల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని వారు తెలియజేశారు గత సంవత్సరం వానాకాలం ఎండాకాలంలో పండించిన పంటలకు బోనసు ఇస్తామని చెప్పిన కొంతమందికి మాత్రమే వారి ఖాతాలో జమాయిన ఇంకొంతమందికి ఇప్పటివరకు బోనస్ జమ చేయకపోవడం రైతాంగం పట్ల ప్రభుత్వ అనుసరిస్తాను నిర్లక్ష్య వైఖరి అని వారు అన్నారు ఇప్పటికైనా రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వారి పంటను సరసమైన ధరకు అమ్ముకునే విధంగా వారిని కాపాడాలని వారు గుర్తు చేశారు గత సంవత్సరం మొక్క రైతులు విత్తన కంపెనీలతో అనేక ఇబ్బందులకు గురయ్యారని వారి పంటకు వచ్చే డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందారని కంపెనీ ఏజెంట్ల పై పోలీసు కేసులు పెట్టారని వారు తెలియజేశారు స్థానిక అధికారులు ఈ విషయాన్ని గమనించి రైతులకు ఎటువంటి దళారుల వ్యవస్థ దోపిడీ జరగకుండా రైతులను కాపాడాలని వారు ప్రభుత్వానికి సూచించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులుజే.. నరసింహారావు.పారుపల్లిబాబురావు లింగాల వీరభద్రం.టి నరేష్ జి లక్ష్మణ్ శ్రీను స్వామి బాలు బిక్షమయ్య సక్రు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >