Posted on 2026-04-17 10:15:59
డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ లోని అన్ని విశ్వవిద్యాల యాలకు పాలకమండలి సభ్యులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పేరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో భాగంగా కామారెడ్డి జిల్లా చెందిన మహమ్మద్ ఘాజిని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) సభ్యునిగా నియమిస్తూ జీవో విడుదలైంది. ఈ సందర్భంగా మహమ్మద్ ఘాజి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో స్థాపించబడిన తెలంగాణ యూనివర్సిటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండటం గర్వకారణమని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం అన్ని రంగాలలో కృషి చేస్తూ, యూనివర్సిటీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు అధికారులతో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని మహమ్మద్ ఘాజి స్పష్టం చేశారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >