Posted on 2026-04-18 09:08:38
పోలీసు అధికారులను ఆహ్వానించిన కమిటీ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఏప్రిల్ 26, 2026న నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించి, సమ్మేళనం కమిటీ సభ్యులు మరింత కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు.
ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిసి, సమ్మేళనం కార్యక్రమానికి ఆహ్వానం అందజేశారు. కార్యక్రమం యొక్క లక్ష్యాలు, ఏర్పాట్లు మరియు ప్రజల పాల్గొనిక గురించి వివరించారు.
కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, హిందూ సమాజంలో ఐక్యత, ధర్మ పరిరక్షణ, సాంప్రదాయ విలువల పరిరక్షణ లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం శాంతియుతంగా మరియు క్రమబద్ధంగా నిర్వహించబడుతుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి కార్యక్రమం గురించి తెలుసుకుని, చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షులు పి. వీరవర్ధనరావు, కార్యదర్శి లట్టి జగన్ మోహన్, సభ్యులు యెల్దండి పూర్ణచందర్ రావు, వెంకట్ రెడ్డి, రాజేశ్వరరావు, మరియు న్యాయవాది పాతూరి పాండురంగ విటల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >