Posted on 2026-04-18 13:41:10
డైలీ భారత్, నిడదవోలు : తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి పరిధిలోని నిడదవోలులో మహిళా సాధికారత బిల్లుకు మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. పార్లమెంటులో మహిళల హక్కులకు విఘాతం కలిగిందని, ఇది దేశానికి “బ్లాక్ డే”గా మిగిలిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ఆశలను ప్రతిపక్షాలు ధ్వంసం చేశాయని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు దాని మిత్రపక్షాలు భారతీయ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించాయని, మహిళలకు ఇది ద్రోహమని తీవ్రంగా స్పందించారు.
“ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు” అన్న మన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని, కానీ రాజకీయాల్లో మాత్రం వివక్ష చూపడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే పేరుతో బిల్లును వ్యతిరేకించాయని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేసినా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు.
మూడున్నర దశాబ్దాలుగా మహిళా సాధికారత కోసం పోరాడుతున్నామని చెప్పిన సీఎం, నిన్న పార్లమెంట్ సాక్షిగా ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని అన్నారు. “ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్షాలు రేపు మహిళల ఓట్లు అడుగుతాయి?” అంటూ ప్రశ్నించారు.
పంచాయతీ స్థాయిలో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఉద్యోగ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని గుర్తుచేశారు. అలాంటి సమయంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకోవడం క్షమించరాని చర్యగా అభివర్ణించారు.
వచ్చే ఎన్నికల్లో మహిళలతో ద్రోహం చేసిన పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన సీఎం, నిడదవోలులో ప్రారంభమైన ఈ పోరాటాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. “ఇది ప్రారంభం మాత్రమే… ఇక్కడితో ఆగదు” అని హెచ్చరించారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >